పవన్ మాజీ భార్య గురించి వైరల్ అవుతున్న షాకింగ్ విషయాలు...!!
పవన్ కళ్యాణ్ హీరోగా రాణిస్తున్న కెరీర్ ప్రారంభంలోనే నందిని అనే అమ్మాయితో పెళ్లి జరిగిందట.. 1997లో వీరి వివాహం జరిగింది.దాదాపు పదేళ్లపాటు ఈ ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారట.. ఆ సమయంలో సుమారు ఐదు కోట్ల వరకు ఆమెకి విడాకుల భరణంగా పవన్ ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత నందిని ఎక్కడా కూడా కనిపించలేదు. పూర్తిగా ప్రైవేట్ లైఫ్కే ఆమె పరిమితమయ్యింది.
వైజాగ్కి చెందిన నందిని ఆమె మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంది. డాక్టర్ కృష్ణరెడ్డిని ఆమె వివాహం చేసుకున్నట్టు గా వార్తలొచ్చాయి. ఆయన అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ అని సమాచారం.. అక్కడ మంచి వ్యాపారాలున్నాయట. అయితే పవన్ తో విడాకుల తర్వాత ఆమె తన పేరు కూడా మార్చుకుందని తెలుస్తుంది.. జాన్వీగా పేరు మార్చుకున్నట్టు గా సమాచారం. ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటుందన్నారని, చాలా రాయల్ లైఫ్ అనుభవిస్తున్నట్టు గా తెలుస్తుంది.
నందిని(జాన్వీ) భర్త అక్కడ రిచ్ పర్సన్ అని, వందల కోట్ల ఆస్తులున్నట్టు సమాచారం. వారి ఆస్తుల విలువ సుమారు మూడు వందల కోట్ల వరకు ఉంటాయని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సమాచారం నెట్టింట వైరల్అవుతున్నాయి.. తన గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం తన ఫ్యామిలీతో హాయిగా ఉందట. ఆమె పూర్తిగా ప్రైవేట్ లైఫ్ని లీడ్ చేయడానికే ఇష్టపడుతుందని, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆమెకి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయటకు రాలేదు. బట్ యూఎస్లో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక పవన్ నందినికి విడాకుల అనంతరం రేణు దేశాయ్ని ప్రేమించి అకిరా నందన్ పుట్టిన తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. 2009లో వీరి పెళ్లి జరగ్గా ఆ తర్వాత ఆద్య కూడా జన్మించింది. 2012లో రేణు దేశాయ్కి కూడా పవన్ విడాకులిచ్చాడు. అందుకు భారీగానే భరణం చెల్లించినట్టు పవన్ చెబుతుంటాడు. తన ఆస్తిలో పెద్ద వాటనే ఆమెకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.. అయితే ఇప్పటికే తన పిల్లలు అకీరా, ఆద్యలకు పవన్ టచ్లోనే ఉంటారట.వారి బాగోగులు కూడా ఆయన చూసుకుంటున్నారట.
`తీన్ మార్` సినిమా సమయంలో రష్యాకి అన్నా లెజినోవాతో పవన్కి పరిచయం ఏర్పడింది. 2013లో ఆమెని వివాహం చేసుకున్నారు పవన్. వీరికి కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం తనమూడో భార్యతో ఉంటున్నారట పవన్. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. జనసేన పార్టీని ఆయన స్థాపించి రాజకీయాల్లో కూడా బిజీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లోపోటీకి రెడీ అవుతున్నారు. ఆ ఎలక్షన్లలోపూ ఒప్పుకున్న నాలుగు సినిమాలను ఫ
పూర్తి చేయాలనుకుంటున్నారట