కోర్టులో లొంగిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. కారణం..?

Divya
తెలుగులో తొలిప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ తో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ ఆ తర్వాత మహేష్ బాబుతో నాని చిత్రంలో నటించి అందరికీ గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో అవకాశాలు రావడంతో అక్కడ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది అమీషా పటేల్. తన వయసుతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకోవడం జరుగుతోంది. అయినా సరే అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.


ప్రస్తుతం  అమీషా పటేల్ సన్నీ డియోల్ కి జోడిగా గద్దర్-2 సినిమాల నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇదంతా ఇలా ఉంటే అమీషా పటేల్ ఎంత స్టార్ ఇమేజ్ అందుకున్న కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అక్షయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత గతంలో రాంచికోర్టులో ఈమె పైన కేసు వేయడం  జరిగింది.. తనకి ఒక సినిమా చేస్తానని అమీషా పటేల్ రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్  తీసుకుందని కానీ ఆ సినిమాలో నటించలేదని పిటిషన్లు తెలియజేసినట్లు సమాచారం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే చల్లని చెక్కు ఇచ్చి తనని మోసం చేసిందని ఫిర్యాదుల తెలియజేయడం జరిగింది.

వారి నుంచి తప్పించుకోవడానికి కోసం ముఖానికి ముసుగు వేసుకొని స్పీడ్ గా నడుచుకుంటూ కారులో రావడం జరిగింది. అయినా కూడా మీడియా వాళ్ళు మాత్రం ఫోటోలు తీయడం మానలేదు. మొత్తానికి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది రూ.2.5 కోట్ల రూపాయలతో పాటు అదనంగా 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆ నిర్మాత డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై రాంచికోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: