ఐదు మంది యాక్టర్స్ పైన వేటుపడనుందా..!!

Divya
కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఉమ్మడి సంస్థ ఉన్నది.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో తలెత్తే సామాజిక రాజకీయ సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకే పలు రకాల వాటిని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా నిర్మాత మండలి కొంతమంది కోలీవుడ్ నటి నటుల పైన రెడ్ కార్డు జారీ చేసే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ముఖ్యంగా హీరో విశాల్, శింబు, యోగి బాబు, ఎస్ జె సూర్య, అధర్వ లకు నిర్మాత మండలి వారు రెడ్ కార్డు జారీ చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సదర్ స్టార్ నిర్మాతలకు సరిగ్గా సహకరించని కారణంగా వీరి పైన వేటుపడబోతున్నట్లు సమాచారం.


ఐదుగురు స్టార్లు సరికొత్త ప్రాజెక్టుల కోసం చిత్ర నిర్మాతల నుండి ముందాస్తు అడ్వాన్సులు తీసుకొని షూటింగ్ కోసం తేదీలను ఖరారు చేయకపోవడంతో వీరి పైన కొంతమంది నిర్మాత మండలి వారు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందుకే వీరి పైన నిర్మాత మండలి వారు సర్వసభ్య సమావేశంలో తగిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు కానీ కొంతమంది పేర్లు అయితే వైరల్ గా మారుతున్నాయి..

ఇందులో కొంతమంది గతంలో రెడ్ కార్డు పొందిన వారు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం చేత ఇలా రెడ్ కార్డ్ జాబితాలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం వీరందరి సినిమాల విషయానికి వస్తే శింబు తన 48వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిని దేశింగ్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. విశాల్ ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తూ ఉన్నారు. యోగి బాబు పలు తెలుగు చిత్రాలతో పాటు కోలీవుడ్ చిత్రాలలో కూడా కమెడియన్గా హీరోగా నటిస్తూ ఉన్నారు. రెడ్ కార్డ్ అనేది క్రమశిక్షణ లేని నటులను కూడా ఈ రెడ్ కార్డ్ ఉపయోగించుకోవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: