ఓకే ఫ్రేమ్ లో టాలీవుడ్ లెజెండ్స్.. ఫోటో వెనుక స్టోరీ ఇదే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఏదో ఒక హీరోకు సంబంధించిన న్యూ లుక్ ఫోటో వైరల్ గా మారడం కామన్. కానీ టాలీవుడ్ హీరోలందరూ కూడా ఒక్కచోట చేరి ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇక ఆ ఫోటో ఏకంగా అభిమానులు అందరిలో కూడా సంతోషాన్ని నింపుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇక ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఈ ఫోటో వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉందట. మూస పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం చిరంజీవికి నచ్చక.. కొత్తగా ఏదైనా చేయాలని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో ముగ్గురు మొనగాళ్లు సినిమా చేయడానికి సిద్ధమయ్యారట. స్టార్ హీరో చిరంజీవి ఒకేసారి మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.


 1994న విడుదలైన ఈ సినిమా ఎంత అఖండ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంజన ప్రొడక్షన్స్ పతాకం పై నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ నగ్మా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పక్కనే మరో షూట్లో ఎన్టీఆర్, దర్శకనిర్మాత దాసరి నారాయణరావు, నిర్మాత రామానాయుడు, హీరో నాగార్జున ఉన్నారట. దీంతో ఈ విషయం తెలిసి చిరంజీవి వెళ్లి కలిశారట. ఇక వారంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇక ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి లెజెండ్స్ అందరూ ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని సినీ ప్రేక్షకులు అందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: