ఆస్కార్ రేసులో ఎంట్రీ ఇస్తున్న విక్రమ్ తంగళన్..!!

Divya
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగళన్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.విక్రమ్ ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా పైన భారీగా హైప్ ఏర్పడడం జరిగింది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా విక్రమ్ సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు.. విక్రమ్ ప్రతి సినిమాకి కూడా సరికొత్త కథ అంశంతో విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. ఈ చిత్రంలో కోలార్ బంగారుగనులలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.


ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తున్నది. ఇదంతా ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు సాధించడమే లక్ష్యంగా చిత్ర బృందం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ తో సహా మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొనే లక్ష్యంతోని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నామని తాజాగా ప్రొడ్యూసర్ ధనంజయ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.


తంగళన్ సినిమాకి ఆస్కార్ తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ కేవలం మరో పది రోజుల్లో పూర్తి అవుతుందని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో తంగళన్ చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్ లో స్కిన్నింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు ఆస్కార్ రేసులో ఈ సినిమా నిలవడం ఖాయం అనిపిస్తోందంటూ కూడా తన అభిప్రాయంగా తెలియజేశారు.2D,3D వర్షన్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: