తంళన్‌: భారీగా పెరిగిన హైప్.. అంత కంటెంట్ ఉందా?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం చిత్రం ‘తంళన్‌’. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై అభిమానుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి.హీరో విక్రమ్‌ ఫస్ట్‌ లుక్‌తోనే ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా హీరో విక్రమ్‌ సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇక కోలార్‌ బంగారు గనుల్లో జరిగిన కొన్ని నిజ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ మూవీలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులు సాధించడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ అడుగులు వేస్తోంది.ఇది విన్న నెటిజన్స్ ఈ మూవీలో అంత విషయం ఉందా అయితే తప్పకుండా చూడాలి అని కామెంట్స్ చేస్తున్నారు.


ఆస్కార్‌తో సహా మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడగు వేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నీలం ప్రొడక్షన్‌ హౌస్‌ సీఈఓ ధనంజయన్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తంగళన్‌ సినిమాని ఆస్కార్‌కు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సల్‌ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కేవలం మరో 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే తంగళన్‌ మూవీని 2024లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టులో తంగళన్‌ మూవీని ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌ చేయనున్నారు. ఆస్కార్‌ రేసులో ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల చేయనున్న ఈ మూవీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.చూడాలి ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్ కి వెళుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: