హన్సికపై షాకింగ్ కామెంట్లు చేసిన కమెడియన్..!!

Divya
గత కొంతకాలంగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన కోలీవుడ్ హీరోయిన్ హన్సిక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని అక్కడే వరుస సినిమాలలో నటిస్తోంది. ఇక గత ఏడాది డిసెంబర్లో ఈమె వివాహం చేసుకుంది. హీరో ఆదిపినిశెట్టితో కలిసి పార్టనర్ అనే చిత్రంలో తాజాగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సమయంలోనే చెన్నైలో ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా చేయడం జరిగింది.ఈవెంట్లో హన్సికపై కోయాప్టర్ రోబో శంకర్ షాకింగ్ కామెంట్లు చేశారు.
అయితే ఈయన మాటలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయంటూ పరువులు నేటిజెన్లు సైతం శంకర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అంటే పార్ట్నర్ చిత్రంలో హన్సిక కాళ్ళను తాకాల్సిన సన్నివేశం ఒకటి ఉందని రోబో శంకర్ తెలియజేశారు కానీ ఆ సీన్ చేసేటప్పుడు తాను హన్సిక కాలినే కాదు బొటనవేలును కూడా తాకడానికి ఆమె ఒప్పుకోలేదని తెలియజేయడం జరిగింది. కానీ ఇదే సినిమాలో హీరో ఆది తన కాలు తాగడానికి అనుమతించిందని హీరోగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ స్పీచ్ లో తెలియజేయడం జరిగింది శంకర్.

అయితే ఈ వేదికపై హన్సిక తన వాక్యాలతో కాస్త ఇబ్బంది పడ్డ శంకర్ మాత్రం ఇవన్నీ జోవియల్ గా తీసుకోవాలంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక జర్నలిస్ట్ సైతం శంకర్ తన లిమిట్స్ క్రాస్ చేశారని తెలియజేశారు.. పార్ట్నర్ మూవీ టీం రోబో శంకర్ తరుపున హన్సికకు క్షమాపణలు తెలియజేసింది కానీ టీం నుంచి మాత్రం ఎటువంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు . ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రంలో యోగి బాబు, పాండ్య రాజా, టైగర్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: