టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా సమంత చేసిన ఒక పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు సిటాడిల్ వెబ్ సిరీస్ లో సైతం నటిస్తూ బిజీగా ఉంది సమంత. అయితే కొద్ది రోజులుగా సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా ఎంతలా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆరోగ్యం కోసమే సమంత ఈ నిర్ణయం తీసుకుందని
ఆమె అభిమానులు మరియు నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా సమంత చేసిన మరొక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరో మూడు రోజుల్లో ఈ కార్యమైన లైఫ్ పూర్తవుతుంది అని..ఈ కష్టమైన ఆరు నెలలు గడిచిపోయాయి అని.. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీతో పాటు ఇలాంటి క్యాప్షన్ను జోడించి షేర్ చేసింది. సమంత ఇక ఈ స్టోరీ చూసిన సమంత అభిమానులంతా ఎంతో కష్టంగా షూటింగ్లో పాల్గొంటుంది అని అంటున్నారు. సమంత పోస్ట్ చేసిన ఆ ఫోటోని చూసి సమంత ఎంత
కష్టపడిందో ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుందో అంటూ పలు రకాల కామెంట్స్ ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ క్రమంలోని సమంత ముఖంలో మళ్లీ మార్పులు కనిపించడం మనం గమనించవచ్చు. బహుశా మయోసైటిస్ కు మరోసారి చికిత్స తీసుకోవాల్సిన సమయం వచ్చింది కావచ్చు అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా సమంత ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. దీంతో సమంత చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!