డైరెక్టర్ తేజ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ...!!
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సీనియర్ స్టార్ రాజశేఖర్. త్వరలోనే రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.ఇటీవల డైరెక్టర్ తేజ స్వయంగా రానా దగ్గుబాటి తో `రాక్షస రాజు` అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాను మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నారట.ఈ సినిమాతో తేజ భారీ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించు కావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.