డైరెక్టర్ తేజ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ...!!

murali krishna
లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయిన రానా ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దాంతో ఆయన హీరోగా వరుసగా సినిమాలు చేశారు.ఆయన చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికి ఎవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు ఇక దాంతో ఆయన బాహుబలి సినిమాలో విలన్ గా నటించారు ఇక అప్పటి నుంచి వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నాడు...ఈయన సోలోగా చేసిన సినిమాలు కూడా ప్రస్తుతం సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి.గత చిత్రాలు అయిన అరణ్య, విరాట పర్వం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన `భీమ్లా నాయక్`మాత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు రానా మరో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నారు. అది కూడా ఎవరూ ఊహించని హీరోతో ఆయన మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడు.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సీనియర్ స్టార్ రాజశేఖర్‌. త్వరలోనే రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.ఇటీవల డైరెక్టర్ తేజ స్వయంగా రానా దగ్గుబాటి తో `రాక్షస రాజు` అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాను మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నారట.ఈ సినిమాతో తేజ భారీ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించు కావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: