టమాట ధరలకి చెక్ పెట్టిన కేంద్రం?

Purushottham Vinay
ప్రస్తుతం దేశంలో టమాట విప్లవం జరుగుతుంది. ప్రతి ఇంట్లో టమాట లేనిదే కూర అవ్వదు. ఒక కూర వండాలంటే ఖచ్చితంగా టమాట అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి సామాన్యుడి ఇంటిలో టమాట తప్పనిసరిగా ఉంటుంది.ప్రజలకు నిత్యావసరంగా మారిన టమాటాలు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరలు భరించలేక జనాలు ఎంతగానో అల్లాడిపోతున్నారు. ఇక ఈ క్రమంలో ప్రజల బాధలు తెలుసుకొని టమాట ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రంగంలోకి దిగింది. తాజాగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇంకా బిహార్ అంతటా టమాటల హోల్‌ సేల్ ధరను కిలోకు రూ.80కి తగ్గించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.టమాట ధరలు ఇక నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.దేశంలో టమాట ధరలు అధికంగా వున్న పలు చోట్ల కిలోకు రూ. 90 రాయితీపై అమ్మాలని కేంద్ర ఆదేశాల మేరకు టమాటల హోల్ సేల్ ధరల్లో తగ్గుదల ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.



దేశంలోని మొత్తం 500-ప్లస్ పాయింట్ల నుంచి పరిస్థితిని తిరిగి అంచనా వేశామని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు నుంచి టమాట ధర కిలోకు రూ. 80 అమ్మాలని నిర్ణయించామని పేర్కొనాయి.ఢిల్లీ, యూపీ ఇంకా పాట్నాలోని పలు ప్రాంతాల్లో కూరగాయలను తక్కువ ధరలకు అమ్మేందుకు నేషనల్ కన్స్యూమర్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఫ్) ఇంకా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఎఫ్ఈడీ)లు సదుపాయం కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వం సూచించింది.ఎన్ఏఎఫ్ఈడీ ఇంకా ఎన్ సీసీఎఫ్ ల ద్వారా ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా, ముజఫర్ పూర్ ఇంకా అలాగే అర్రా ప్రాంతాల్లో  ఇక నుంచి రాయితీపై టమాట అమ్మకాలు ప్రారంభమయ్యాయని చెప్పాయి. మార్కెట్ లో టమాట ధరలకు కళ్లెం వేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు వాటిని విస్తరిస్తామని కూడా వివరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: