స్మశాన పక్కనే ఫ్లాట్ కొన్నా.. దయ్యం కలలతో వణికిపోయా : హీరోయిన్

praveen
ఒకసారి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు అంటే చాలు వారి గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వారు పుట్టి పెరిగిన ప్రాంతం ఎక్కడా అని తెలుసుకోవడమే కాదు  పర్సనల్ విషయాలు అన్నీ తెలుసుకోవడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన విషయాల కోసం గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ తెగ వెతికేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఒకప్పుడు ఇలా సినీ సెలబ్రిటీల గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి చాలానే కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇక సినీ సిలబరిటీల పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకంలా మారిపోయింది. ఎందుకంటే నేటి రోజుల్లో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్యతేడా కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. దీంతో సెలబ్రిటీలు నేరుగా ఇక అభిమానులతో తమ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాము. ఇక ఈ క్రమంలోనే తమ పర్సనల్ లైఫ్ లో ఏదైనా కొన్ని విచిత్రమైన అనుభవాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సినీ సెలబ్రిటీలు.


 ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సైతం ఒక బంగ్లా కొన్న సమయంలో తనకు ఏదైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను మొదట్లో ముంబై బాంద్రాలో స్మశాన వాటిక దగ్గరలో ఉన్న ప్లాట్ కొన్నాను. ఇక అక్కడే ఉండేదాన్ని. ఇక ఆ సమయంలో భయంకరమైన కలలు వచ్చేవి. దీంతో ఎంతో భయపడి పోయే దాన్ని అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది నర్గీస్ ఫక్రి. ఇలా వచ్చిన కలలో ఒక దయ్యం కలలోకి వచ్చి నన్ను స్మశానానికి తీసుకువెళ్లి సమాధులను తవ్వి మనుషులు ఎముకలు తినమని చెప్పేది. దీంతో ఒక్కసారిగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉలిక్కిపడి లేచే దాన్ని. దీంతో భయంతో వనికి పోయేదాన్ని. ఇక ఈ భయాన్ని తట్టుకోలేక చివరికి ఢిల్లీకి మారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: