రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలలో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న
మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మ్యాడ్ మాత్రమే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపొయింది.రోజు రోజుకి ఈ సినిమాకి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. అలాగే వీకెండ్ తర్వాత కూడా ఈ
సినిమా కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ ఉన్నవాటిలో బెస్ట్
మూవీ కావడంతో యూత్
ఆడియన్స్ మ్యాడ్
మూవీ చూడటానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే మరీ భారీ కలెక్షన్స్ అయితే రావడం లేదు కానీ పర్వాలేదనే విధంగా ఉన్నాయి.జూనియర్ ఎన్ఠీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాతో
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే
సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ వన్ మెన్ షోతో మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళాడు.
ఇంజనీరింగ్
కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే స్టోరీ పెద్దగా లేదనే టాక్ ఉంది. కానీ ఈ మూవీలో కామెడీని ఫుల్ గా ఆశ్వాదిస్తున్నారు. ఈ
సినిమా దర్శకుడు
కళ్యాణ్ శంకర్
అనుదీప్ కేవీ దగ్గర జాతిరత్నాలు,
ప్రిన్స్ సినిమాలకి వర్క్ చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాడ్ సినిమాని జాతిరత్నాలు మూవీతో పోల్చి చూసారు. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ
సినిమా జాతిరత్నాలు సమీపంలోకి కూడా చేరేలా కనిపించడం లేదు.
కరోనా సమయంలో కూడా జాతిరత్నాలు
సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.సినిమాలు ఏవీ లేకపోవడంతో పాటు థియేటర్స్ కి వెళ్లిన
ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంతో లాంగ్ రన్ కొనసాగి 70 కోట్ల దాకా జాతి రత్నాలు చిత్రం కలెక్ట్ చేసింది. అయితే మ్యాడ్
మూవీ ఇప్పటి దాకా 8 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది.ఇక లాంగ్ రన్ లో మరో రెండు కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓవర్ సీస్ లో 300k డాలర్లు ఈ
సినిమా వసూలు చేసింది.