చాలా చిన్న వయసులోనే డైరెక్టర్గా ఎంత మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు
డైరెక్టర్ సుజిత్. రన్
రాజా రన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మొదటి సినిమాతోనే విమర్శలు ప్రశంసలు అందుకున్న సుజీత ఆ ఒక్క
సినిమా అనుభవంతోనే ఏకంగా
ప్రభాస్ తో కలిసి
సాహో వంటి పాన్
ఇండియా సినిమాని తెరకెక్కించి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పవర్స్టార్ పవన్
కళ్యాణ్ హీరోగా మాఫియా నేపద్యంలో వస్తున్న ఓ జి సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే నేడు
సుజిత్ పుట్టినరోజు. ఓజి
మూవీ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ ఆయన బర్త్డే సందర్భంగా
శుభాకాంక్షలు తెలుపుతూ
పవర్ స్టార్ విశ్వరూపంతో మీరు ఆనందంగా ఉండండి మీ యొక్క అద్భుత మేకింగ్ తో ఫాన్స్ ను ఉత్తేజపరచండి అంటూ
డైరెక్టర్ సుజిత్ కి సంబంధించిన ఒక
పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.
డైరెక్టర్ సుజిత్ తీసిన
సాహో సినిమాకి తెలుగులో అంతటి ప్రశంసలు రాకపోయినప్పటికీ
బాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు పవర్
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తో చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులోనే కాకుండా
బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ
సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అని ఇప్పటికీ విడుదలైన గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. కేవలం యాక్షన్ ఒకటే కాకుండా పాన్
ఇండియా బ్లాక్ బస్టర్ కే జి ఎఫ్
సినిమా ని మించే లాగా ఎలివేషన్స్ సైతం ఉంటాయి అని తెలుస్తోంది. ఆ సినిమాకి పది రెట్లు పవర్ఫుల్గా ఈ
సినిమా ఉంటుంది అని అందరూ నమ్ముతున్నారు. యాక్షన్ తో
సుజిత్ ఈ సినిమాని తెరకెక్కించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడు అని కోరుకుంటున్నారు అభిమానులు. ఇక ఓజీ మా విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. కొంత మేరకు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ రాజకీయ కారణాలవల్ల షూటింగ్ కు సరైన సమయంలో రావడం లేదు..!!