ఆ సినిమా చేసి తప్పు చేసానంటున్నా వైష్ణవి...!!

murali krishna
చాలామంది హీరోయిన్స్ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కోవడమే కాకుండా వరుసగా సినిమా లు చేస్తూ వాళ్ల ఫోకస్ మొత్తం సినిమాల మీద పెడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే హీరోయిన్లు ఇండస్ట్రీ లో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.అయితే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి ఆనంద్ దేవ రకొండ హీరో గా సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో టీమ్ మొత్తానికి మంచి పేరు అయితే వచ్చింది.

ఆ సినిమా లో బోల్డ్ క్యారెక్టర్ చేసినందుకు గాను వైష్ణవికి మంచి పేరు అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకి ఆఫర్లు మాత్రం ఎక్కువగా రావట్లేదు అనేది ఇండస్ట్రీ లో నడుస్తున్న టాక్ ఇక దీంతో ఆమె అనవసరంగా బేబీ సినిమా చేశానని ఇప్పుడు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఫుల్ బిజీగా ఉంటానని తను అనుకున్నప్పటికీ ఇది మాత్రం కుదరలేదు.దాంతో ఆమె అనవసరంగా సినిమా చేసింది అంటూ చాలామంది కూడా ఆమె పైన కామెంట్లు చేయడం జరుగుతుంది.   నిజానికి వైష్ణవి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేసుకుంటూ ఉంటేనే బాగుండేది.ఇక ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత పెద్దగా ఆఫర్స్ లేకపోవడం తో అటు షార్ట్ ఫిలిమ్స్ చేసుకోలేక,ఇటు సినిమాలు చేసుకోలేక ఖాళీగా ఉండాల్సి వస్తుందని తన సన్నిహితులు దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎస్కే ఎన్ ప్రొడక్షన్ లోనే తనకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి...ఇక ఇలాంటి క్రమం లో డైరెక్టర్ సాయి రాజేష్ హీరో ఆనంద్ మాత్రం వరుస గా సినిమాలు చేస్తున్నారు.మారి వైష్ణవి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: