సరికొత్త కథ అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మసూద హీరో..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా నేర్పిస్తున్న యాక్టర్ తిరువీర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పరేషాన్, జార్జ రెడ్డి, పలాస మసూద చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. తిరువీర్ హీరోగా ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పైన సాయి మహేంద్ర చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. డైరెక్టర్ రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.



ఇందులో హీరోయిన్ గా ద్రిష్టి తల్వార్ నటిస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ చూస్తూ ఉంటే చాలా విభిన్నమైన ప్రపంచాల నేపద్యాలతో కథ ఉండబోతుందని కనిపిస్తోంది. ఒకవైపు హిందూ మహిథాలజీ ప్రకారం దేవతల ప్రచారం కూడా ఉన్నది. అయితే అందుకు ప్రతిబింబంగా క్రిస్టియన్ మైథాలజీ ప్రకారం తెల్లని వస్త్రాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు ప్రపంచల మధ్య ఒక బిడ్డ రిప్రజెంట్ ఆగుతున్నట్లుగా చూపించారు. కథ కూడా ఇలాగే రెండు విభిన్నమైన ప్రపంచాల మధ్య నడిచే కథగా అన్నట్లుగా తెలుస్తోంది. డార్క్ కామెడీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.


తిరువిర్ క్యారెక్టర్ ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని కూడా చిత్ర బృందం తెలియజేస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోందని చిత్రబృందం తెలియజేయడం జరిగింది. కాన్సెప్ట్ పోస్టర్తోని ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తున్న తిరివిర్ ఈ చిత్రంతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు చూడాలి మరి వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అయ్యేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మసూద్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తిరువీర్ ఆ తర్వాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అయితే ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: