"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు వస్తున్నారు కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మొదటి సినిమాతో మంచి విజయాలను అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన చాలా తక్కువ బడ్జెట్ తో పెళ్లి చూపులు అనే సినిమాని రూపొందించాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరో గా నటించగా రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే పెద్దగా ఎలాంటి అంచనలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో తరుణ్ కి కూడా తెలుగులో సూపర్ క్రేజ్ లభించింది. ఈ మూవీ తర్వాత ఈయన ఈ నగరానికి ఏమైంది అనే యూత్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత దర్శకత్వం కాకుండా చాలా సినిమాల్లో నటించిన తరుణ్ తాజాగా కీడా కోలా అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన ఓ మూవీ ని రూపొందించాడు.

ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: