ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి....!!
అయితే డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందంతో కొన్ని థియేటర్లు నైజాంలో హనుమాన్ తీసుకున్నా.. హనుమాన్ ను రిలీజ్ చేయలేదట. ఇక ఇదే విషయంపై హనుమాన్ చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. “మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు ‘హనుమాన్’ 12-1-2024 నుంచి ప్రదర్శన కొరకు తెలంగాణలోని కొన్ని థియేటర్లవారితో అగ్రీమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు అగ్రీమెంట్ ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో ఈ ప్రదర్శన చేయలేదు. ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. థియేటర్లు అగ్రీమెంట్ ప్రకారం హనుమాన్ ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం జరిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హనుమాన్ ప్రదర్శనను ప్రారంభించడంతోపాటు ఇప్పటివరకు జరిగిన నష్టం భరించాలి.
థియేటర్లు వారి ఇటువంటి చర్యలవలన తెలుగు మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ.. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం, నైతికత, నిబద్ధత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ హనుమాన్ కు సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నది” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.