అందరి ఆశీస్సులు పంపండి అంటూ పోస్ట్ చేసిన యంగ్ హీరో నిఖిల్....!!
ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది..ఇదిలా ఉంటే హీరో నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్గా వీరి వివాహం జరిగింది. త్వరలోనే నిఖిల్ తండ్రి కూడా కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు..ఈ వేడుకలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు.
నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి' అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు నిఖిల్, పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది