షాక్:సీతారను కూడా వదలని సైబర్ నేరగాళ్లు.. ఏం జరిగిందంటే..?

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువగా సైబర్ నేరగాళ్లు రోజురోజుకి అమాయకులైన ప్రజల సొమ్ము కాజేయాలని పలు రకాలుగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మోసపూరితమైన మెసేజ్లతో మొబైల్ హ్యాక్ చేయడం ఇతరత్రా వాటితో దోచుకుంటున్నారు. కొత్త కొత్త తరహాలో చీటింగ్ లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు రకాల బడా సంస్థల పేర్లతో మోసాలు కూడా చేస్తూనే ఉన్నారు.తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను ఇప్పుడు టాలీవుడ్ హీరో అయినా మహేష్ బాబు కూతురు సితార పైన పడింది. దింతో సైబర్ మోసాలకు తెర లేపే విధంగా చేస్తున్నారట.


సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరుతో అభిమానులకు ఫేక్ ట్రెండింగ్ లింకులను పంపిస్తూ సైబర్ నేరగాళ్లు నగదు కాజేస్తున్నారట. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది .ఈ విషయం పై మహేష్ టీం దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు అలర్ట్ అయి హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. వారి ఫిర్యాదు కేసును నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.


త్వరలోనే సైబర్ నేరగాలని కూడా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. అంత వరకు అభిమానులు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తే ఒక లెటర్ ని కూడా మహేష్  టీమ్ పోస్ట్ చేసింది. సితార పేరుతో వచ్చే ఎలాంటి అనుమానాస్పదమైన నోటిఫికేషన్, మెసేజ్ ల పైన  ఎవరు స్పందించ వద్దంటూ మహేష్ టీం తెలిపింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.సితార కూడా చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూనే పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రేజీ ని ఉపయోగించే సైబర్ నేరగాళ్లు ఇలాంటి పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: