బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్ర లుగా అనిల్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001 లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది.జీ స్టూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎంఎం మూవీస్ బ్యానర్ లపై అనిల్ శర్మ, కమల్ ముకుత్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మించారు. గతే డాది రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందు కోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంది. థియేటర్ లో మాత్రమే కాకుండా జీ5 ఓటిటీ లో కూడా తన సత్తా చాటింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో అత్యంత ఆదరణ పొందిన ఛానళ్ల లో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అలరించేం దుకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుం టోంది. వారం వారం సరికొత్త సినిమా లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగ ఈ ఆదివారం గదర్ 2 ను కానుకగా అందిం చనుంది. ఫిబ్రవరి 18న సాయం త్రం 5:30 గంటలకు జీ తెలుగు లో ఈ సినిమ ప్రసారం కానుంది. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం లో తారా సింగ్ (సన్నీ డియోల్) ప్రయాణమే ప్రధాన ఇతివృ త్తంగా తెరకెక్కింది. జైలు లో ఉన్న తన కుమారుడు చర ణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ను రక్షిం చడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివ చ్చిన తారా సింగ్ ఎలాంటి పరి స్థితులు ఎదు ర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.