పాన్ వరల్డ్ రేంజ్ లో రానున్న సూర్య కంగువ మూవీ...!!
పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'కంగువ' సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటి అంటే పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం మొత్తం పైన పది భాషల్లో తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది అని అంటున్నారు ఈ సినిమా నిర్మాతలు. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'కంగువ' ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కావడం ఖాయం అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.రాక్ స్టార్ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి, ఎడిటర్ గా నిశాద్ యూసుఫ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.