టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది.బాలీవుడ్లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు.ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.దీంతో బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హీరో నిఖిల్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక కార్తికేయ 2 రిలీజ్ సమయంలోనే ఈ సినిమా మరి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ఇక అప్పటినుండి కార్తికేయ 3 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తన్నారు. ఇక తాజాగా కార్తికేయ 3పై అదిరిపైఅదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నిఖిల్. ఇదే విషయం గురించి ఆయన తన సోషల్ మీడియాలో వివరించాడు.. సరికొత్త సాహసం కోసం డాక్టర్ కార్తికేయ వెతుకుతున్నాడు.. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాడు.. అంటూ రాసుకొచ్చాడు.దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఈ ఒక్క అప్డేట్ చూసి కార్తికేయ సినిమా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిఖిల్ భయ్యా కార్తికేయ 3ని త్వరగా ఫినిష్ చెయ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిఖిల్ సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే స్పై సినిమాతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం స్వయంభూ అనే హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచార్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.