పృధ్వీరాజ్ తో పెళ్లే కాలేదంటూ షాకింగ్ పోస్ట్ చేసిన శీతల్..!!
పృధ్విరాజ్- శీతల మధ్య దాదాపుగా 30 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. అయితే వీరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారని వార్తలు రావడంతో తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్ లో పృధ్వి రాజుతో తాను డీ వర్డ్స్ తీసుకోలేదంటూ ప్రకటించింది.. మాకు అసలు పెళ్లి కాలేదు ఇప్పటివరకు మేము లివింగ్ రిలేషన్లో ఉన్నాము అనుకోని కారణాలవల్ల మా ఇద్దరి రిలేషన్ ఆగిపోయింది. కాబట్టి మేమిద్దరం వేరువేరుగానే జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామంటూ తెలిపింది శీతల్..
మా నిర్ణయాన్ని అందరూ దయచేసి గౌరవిస్తూ మాకు ఎటువంటి ఇబ్బందులను కలిగించొద్దండి అంటూ శితల్ పోస్ట్ చేసింది.. 1994లో మొదటిసారి బినాను వివాహం చేసుకున్నారు పృథ్వీరాజ్ వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే గత కొంతకాలంగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. 2022లో చట్ట పరంగా విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్ శితల్ అనే అమ్మాయికి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా శితల్ తమకు వివాహం కాలేదని కేవలం మేమిద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామంటూ తెలియజేయడమే కాకుండా ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోయిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.