అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తండేల్ వర్కింగ్ స్టిల్స్..!!!
ఈ కీలక ప్రాజెక్టును దర్శకుడు చందూ మొండేటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. త్వరలోనే అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయని మేకర్స్ ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ స్టిల్స్ నెట్టింట వైరల్గా మారాయి. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు.కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్ డైరీస్ పేరుతో సెట్స్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ''దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ 'తండేల్'. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య-సాయిపల్లవి డీ -గ్లామర్గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి'' అని చిత్రబృందం ప్రకటించింది.నాగ చైతన్యతో సాయి పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న తండేల్ సినిమా విషయంలో మేకర్స్g ప్లానింగ్ అంతా కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి తండేల్ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.తాజాగా తండేల్ సినిమా షూటింగ్ నుంచి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు..ఈ ఫొటోల్లో ఉన్నారు. ఓ ఫొటోలో తీయబోయే సీన్స్ గురించి చందూ మొండేటి నాగ చైతన్యకు, అల్లు అరవింద్ కి సీరియస్ నమూనా సెటాప్ చూపించి వివరిస్తున్నాడు. ఓ ఫొటోలో చందూ వివరిస్తుంటే సాయి పల్లవి సీరియస్ గా రాసుకుంటుంది.ఇక సాయి పల్లవి మరో మహిళ పక్కన కూర్చొని ఒళ్ళో పాపతో నవ్వుతూ ఉంది. రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుతం షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సాయి పల్లవి అలా ఒళ్ళో పాపని కూర్చోపెట్టుకొని నవ్వుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో తెలిసిందే. ఇటీవల చాలా రేర్ గా సాయి పల్లవి ఫొటోలు బయటకి వస్తున్నాయి. దీంతో పల్లవి ఇంత అందంగా నవ్వుతున్న ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు.GA2 పిక్చర్స్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా హైదరాబాద్ లో భారీ పాకిస్తాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ ఫొటోలు షేర్ చేస్తూ త్వరలోనే సినిమా పైనుంచి అప్డేట్స్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ తర్వాత కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.