3వ రోజు హైయెస్ట్ కలెక్షన్ వాసులు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. వారు నటించిన సినిమా లలో 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఉప్పెన సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.44 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసింది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ లో నాని హీరోగా నటించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.73 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించగా ... సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.77 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సుకుమార్ స్క్రీన్ ప్లే ను అందించాడు.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రలలో 5.68 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన లవ్ స్టోరీ మూవీ కి విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.19 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: