పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆడు జీవితం( ది గోట్లైఫ్).. ఈ మూవీ థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ యాక్టింగ్ అదరగొట్టాడు..ఆ పాత్ర కోసం అతడు పడిన కష్టాన్ని ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు.థియేటర్లలో ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది.ఇదిలా ఉంటే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ది గోట్లైఫ్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకున్నది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 30 కోట్లకు ఆడుజీవితం (ది గోట్ లైఫ్ )డిజిటల్ రైట్స్ను డిస్నీ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం..
ఆడుజీవితం మూవీ ఓటీటీలో మే 10న రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే థియేటర్, ఓటీటీ మధ్య మినిమం నలభై రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మరియు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి నలభై రోజుల తర్వాత ఆడుజీవితం (ది గోట్ లైఫ్ )సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో ఆడుజీవితం ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.ఈ మూవీ ది గోట్డేస్ అనే నవల ఆధారంగా యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు బ్లెస్లీ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. బ్లెస్లీ 2009లో ఈ మూవీని అనౌన్స్చేశాడు. ఈ మూవీ ఎన్నో అడ్డంకులను దాటుకొని చివరకు 2024లో రిలీజైంది. ఈ మూవీలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ మరియు కేఆర్ గోకుల్ కీలక పాత్రలు పోషించారు.