నేడు క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్బంగా ఆహా ఓటీటీ కొత్త సినిమాలు మరియు వెబ్సిరీస్లను ప్రకటించింది.ఎట్లిచ్చినాం అనే క్యాప్షన్తో ఈ వెబ్ ఫిల్మ్స్, సిరీస్లకు సంబంధించిన పోస్టర్స్ను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నది.పాయల్ రాజ్పుత్, ఈషారెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన త్రీ రోజెస్ వెబ్సిరీస్కు ఇప్పుడు సీజన్ 2 రానుంది.డైరెక్టర్ మారుతి క్రియేటర్గా వ్యవహరించిన ఈ సిరీస్కు రవి నంబూరి దర్శకత్వం వహించారు. బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నది.జాన్వీ, రీతూ, ఇందు అనే ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్ల కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. సీజన్ 2లో కూడా పాయల్ రాజ్పుత్, ఈషారెబ్బాతో పాటు పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ ముగ్గరు పబ్లో మందుతాగుతోన్న పోస్టర్ను ఆహా ఓటీటీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా సీజన్ 2లో కనిపించబోతున్నట్లు సమాచారం.
అలాగే తిరువీర్, బిగ్బాస్ బ్యూటీ దీప్తి సతి ప్రధాన పాత్రల్లో నటించిన 'సిన్' వెబ్సిరీస్కు కూడా సీజన్ 2 వచ్చేస్తోంది. 'సిన్ 2' పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. తిరువీర్, దీప్తి సెల్ఫీ ఫొటోకు ఫోజిస్తున్న ఫొటోను ఆహా షేర్ చేసింది... అయితే వారి ముఖాలు కనిపించకుండా షేడ్ చేస్తూ ఈ ఫొటోలో చూపించారు.త్వరలోనే సిన్ 2 వెబ్సిరీస్ సీజన్ 2ను రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా ఓటీటీ తెలియజేసింది.అపార్ట్మెంట్ కల్చర్ బ్యాక్డ్రాప్లో హరివిల్లు పేరుతో ఓ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న ఆహా ఒరిజినల్ మూవీలో హీరోహీరోయిన్లు ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. హరివిల్లుతో పాటు డ్రైవ్, రాక్షసి మరియు లవ్ డైరీస్ సినిమాలను కూడా ఆహా ఓటీటీ ఉగాది సందర్భంగా అఫీషియల్గా అనౌన్స్చేసింది.