మలయాళ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'మంజుమ్మల్ బాయ్స్'. ఫిబ్రవరి 22వ తేదీన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. అక్కడ ఈ మూవీ ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. సుమారు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.మంజుమ్మల్ బాయ్స్ మూవీ తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని గుణ గుహల బ్యాక్డ్రాప్లో సర్వైవర్ థ్రిల్లర్గా తెరకెక్కించారు.డైరెక్టర్ చిదంబరం ఈ చిత్రాన్ని ఎంతో థ్రిల్లింగ్గా ఉండేలా తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అరున్ కురియన్ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీలో నటీనటుల పర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.మంజుమ్మల్ బాయ్స్ మూవీని పరవ ఫిల్మ్స్ బ్యానర్పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్ మరియు షాన్ ఆంటోనీ నిర్మించారు..ఈ సూపర్ హిట్ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఈ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. ఇక్కడ కూడా ఈ మూవీ అంచనాలకు మించి భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే గతంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందంటూ కొన్ని తేదీలపై ప్రచారం జరిగింది.. అయితే, తాజాగా మంజుమ్మల్స్ బాయ్స్ చిత్రం స్ట్రీమింగ్కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది.ఈ చిత్రాన్ని మే 3వ తేదీన డిస్నీ+ హాట్స్టార్ స్ట్రీమింగ్కు తీసుకురాబోతున్నట్లు సమాచారం.. మే 3న మలయాళం మరియు తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో ఈ చిత్రాన్ని హాట్స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది