పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ పతాకంపై యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి.తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియోని విడుదల చేయగా దానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ మూవీలో పలువురు అగ్రతారల నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో భాగం కానున్నారని తెలుస్తోంది.నాని , విజయ్ దేవరకొండ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటి అన్నాబెన్ కూడా 'కల్కి' మూవీలో లో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పడుకొణె నటిస్తోంది. ఇంకా అంతే కాదు ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
గతంలో దుల్కర్ సల్మాన్ దీని గురించి మాట్లాడుతూ.. 'ఈ విషయం గురించి నేనిప్పుడు చెప్పాలనుకోవడం లేదు. 'కల్కి' సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే డిజైన్ చేయగలడు' అని దుల్కర్ అన్నారు. పాత్రలకు తగ్గట్టు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ.. తమిళంలో కమల్హాసన్.. హిందీలో అమితాబ్, దిశాపఠాని.. కేరళలో అన్నాబెన్, దుల్కర్ సల్మాన్ లు సినిమా ప్రత్యేకతలుగా ఉన్నారు.ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తారని అందుకే దర్శకుడు ఇలా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇది మహాభారతం తో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ . మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ అంతా విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతను ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా రికార్డులు సృష్టించడం ఖాయం.