టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖ-సుప్రీత తల్లీకూతుళ్ల గూర్చి తెలియని వారులేరు. వారు చేసే బోల్డ్ కంటెంట్ అలాగే ఫొటోస్ సోషల్ మీడియా లో దుమారం రేపుతుంటాయి.సుప్రిత హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. అమర్దీప్ చౌదరి హీరోగా చేస్తున్నాడు.సుప్రీత కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్గా ఉంటుంది. బోల్డ్ గా రచ్చ చేస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లతో తెగ రచ్చ చేస్తుంటుంది. తల్లీ కూతుళ్లు చేసే యాక్టివిటీస్ చాలా వరకు ట్రోల్స్ కి కారణమవుతుంటుంది. ఇక ఇదిలా ఉంటే సుప్రీత .. లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆమె స్టార్ సింగర్ పై క్రష్ ఉందనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని యాంకర్ రీతూ చౌదరి వెల్లడించడం విశేషం. రీతూ చౌదరి హోస్ట్గా దావత్ అనే షోరన్ అవుతున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఇందు లో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
అందు లో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్ లో సింగర్ శ్రీరామ చంద్ర పాల్గొన్నారు. ఇంత లో యాంకర్ రీతూ చౌదరి.. ఆయన పై ఇద్దరు భామలు క్రష్ పెంచుకున్నారని తెలిపింది. ఎవరు అని అడగ్గా, కుషిత అని చెప్పింది. ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని, ఆయన మొగుడి లా అనిపిస్తాడు అని కుషిత చెప్పడం తో శ్రీరామ చంద్ర మీసాలు తిప్పుతూ రెచ్చిపోయాడు. ఇక సుప్రీత కూడా మీరంటే క్రష్ అని తెలిపింది.. దావత్ షోకి శ్రీరామ చంద్ర వస్తున్నాడని ఆమె తో చెబితే.. ఏ అడుగు నేను సింగిలే, ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందట సుప్రీత. దీనికి నవ్వులు పూయించిన శ్రీరామ చంద్ర, తాను సింగిలే అని, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చాడు.