ఆ సూపర్ హిట్ ఐటెం సాంగ్ ను మిస్ చేసుకున్న శ్రీముఖి..!!
మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ బి మధు నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, పి రవిశంకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందించాడు. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు వరుస ఫ్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ మూవీ తో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇకపోతే ఈ చిత్రంలో భూం బద్దాల్.. అంటూ అప్సర రాణి చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే వాస్తవానికి ఈ పాట శ్రీముఖి చేయాల్సిందట. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీముఖి సంప్రదించాలని మొదట భావించారట. కానీ ఆమె అంతగా ఎక్స్పోజింగ్ చేయదని చాలా మంది గోపీచంద్ మలినేని తో అన్నారట. దాంతో గోపీచంద్ మలినేని శ్రీముఖిని సంప్రదించకుండానే అప్సర రాణిని ఎంపిక చేశారట. అయితే ఓ ఈవెంట్ లో భూం బద్దాల్ సాంగ్ కు శ్రీముఖి డాన్స్ చేసింది.శ్రీముఖి పర్ఫామెన్స్ అనంతరం అదే ఈవెంట్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఆమెతో మాట్లాడారట. ఈ సాంగ్ కోసం మొదట నిన్నే తీసుకోవాలని భావించామని జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారట. దాంతో క్రాక్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు శ్రీముఖి ఎంతో ఫీల్ అయిందట. తాజా ఇంటర్వ్యూలో శ్రీముఖి ఈ విషయాన్ని అందరితో పంచుకుంది. ఏదైనా భూం బద్దాల్ సాంగ్ శ్రీముఖి చేసి ఉంటే మరో లెవెల్ లో ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.