చిరంజీవికి 20 నిమిషాలు కథ చెప్పడం కోసం అన్ని రోజులు ప్రాక్టీస్ చేశా... సుకుమార్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ టాప్ డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన ఆర్య మూవీతో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా 2004 వ సంవత్సరం మే 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందించింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆర్య యూనిట్ ఓ ఈవెంట్ ను నిర్వహించింది.

దానికి ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ , నిర్మాత దిల్ రాజు , సినిమాటో గ్రాఫర్ రత్నవేలు , మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శివ బాలాజీ మరి కొంత మంది అతిధులు వచ్చారు. ఇక ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ ... ఆర్య మూవీ ఓకే కాకముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. అలాగే చిరంజీవి గారికి ఈ సినిమా కథ చెప్పడం గురించి తను పడ్డ కష్టాల గురించి కూడా వివరించాడు. తాజాగా సుకుమార్ మాట్లాడుతూ ... ఆర్య స్టోరీ మొత్తం కంప్లీట్ అయింది. అల్లు అర్జున్ , అరవింద్ గారు ఇద్దరు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే అరవింద్ గారు ఈ సినిమా కథను చిరంజీవి గారికి వినిపించండి అని అన్నారు.

కానీ ఆయన ఒక కండిషన్ పెట్టారు. చిరంజీవి గారికి ఈ సినిమా కథను 20 నిమిషాల్లో చెప్పు అని అన్నారు. ఆ 20 నిమిషాల కథ చెప్పడం కోసం నేను నెల రోజులు ప్రాక్టీస్ చేశా. ఇక చివరికి ఒక రోజు చిరంజీవి గారికి 20 నిమిషాల్లో కథ చెబుదాం అని వెళ్లాను. ఆయన 20 నిమిషాలు కథ విని అద్భుతంగా నచ్చడంతో అలాగే ఆ కథను మూడు గంటల పాటు విన్నారు. అంత ఓపికగా నా కథను విని స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్స్ అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: