సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్యకు ముందు అంత నరకం అనుభవించాడా..?
బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సీరియల్స్ కార్తీకదీపం-2, రాధమ్మ పెళ్లి తదితర సీరియల్స్ లో చందు నటించారు.. తనతో పాటు నటించే పవిత్ర జయరామ్ మరణించిన ఐదు రోజులకె చందు కూడా తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.. ముఖ్యంగా తను ఎంతో ఇష్టపడే పవిత్ర దూరం కావడం తనకు చాలా దురదృష్టమని అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురై చాలా నరకం అనుభవించాడని చందు సన్నిహితులు, స్నేహితుల సైతం తెలియజేస్తున్నారు. గతంలోనే చందుకు శిల్ప అనే యువతిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్ళ క్రితమే నటి పవిత్రత జయరాం సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే చందు పవిత్ర ఇద్దరూ కూడా ఒకే కారులో ప్రయాణిస్తూ ఉండగానే ఈ ఆక్సిడెంట్ జరగడంతో పవిత్ర జయరామ్ అక్కడికక్కడే మరణించగా చందు గాయాలతో బయటపడ్డారు. పవిత్ర తన కళ్ళ ముందే చనిపోవడం చందు జీర్ణించుకోలేకపోయాడు..దీంతో తాను ఒంటరివాడు అయిపోయాననే ఫీలింగ్ తో రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు కావడం చేత చాలా డిప్రెషన్ కి గురయ్యారు.. దీంతో రెండు రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాల్ లో పోస్ట్ పెడుతూ ప్రతిరోజు ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకునేవారు చందు.. చనిపోయే రోజు కూడా గుడ్ మార్నింగ్ నాన్న ఇట్స్ టైమ్ ఫర్ జిమ్ మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు లవ్ యూ పాప అంటూ ఒక పోస్ట్ ని కూడా షేర్ చేశారు. చందు ఆత్మహత్యకు ఇంకా గల కారణాలను మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు.