టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో భజే భాయు వేగం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ ని యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా నిన్న అనగా మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.
ఇకపోతే ఈ సినిమా నుండి ఈ మూవీ విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది.
దానితో ఈ మూవీ కి మొదటి రోజు పరవాలేదు అనే స్థాయి కలెక్షన్ లు వచ్చినప్పటికీ మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమాకు కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బృందం అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ లను చేయడానికి డిసైడ్ అయ్యింది.
అందులో భాగంగా రేపు ఈ మూవీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రెండు ప్రధాన నగరాల్లోని నాలుగు థియేటర్ లను పర్యటించనుంది.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది.
ఇకపోతే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ చిత్ర బృందం రేపు అనగా జూన్ 2 వ తేదీన విజయవాడ నగరం లోని రాజ్ యువరాజ్ థియేటర్ కి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వెళ్లనున్నట్లు , ఆ తర్వాత ఇనాక్స్ లైలా మాల్ కి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించారు.
ఇక ఆ తర్వాత గుంటూరు నగరం లోని భాస్కర్ సినిమాస్ థియేటర్ కి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి వెళ్ళనున్నట్లు , ఆ తర్వాత మైత్రి సినిమాస్ థియేటర్ కి రాత్రి 7 గంటలకు వెళ్ళనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.