టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడంలో అటువంటి సందేహం లేదు. అయితే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు అందరూ కలిసి చేసిన
సినిమా మనం.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014లో విడుదలైన ఈ
సినిమా టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీలోనే ఒక
బ్యూటిఫుల్ సినిమాగా మిగిలిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు
నాగార్జున నాగచైతన్య అఖిల్
అమల సమంత
అందరూ కలిసి నటించిన ఈ
సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చిన కూడా అంతే ఇష్టంతో చూస్తారు అభిమానులు. అక్కినేని నాగేశ్వరరావు
నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ
సినిమా ఫాంటసీ డ్రామాతో అభిమాను లను బాగా ఎమోషనల్ చేసింది. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి
సినిమా కావడంతో ఈ
సినిమా అక్కినేని కుటుంబానికి ఒక
మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్
మీడియా వేదికగా వైరల్
అవుతుంది. అదేంటంటే ఈ
సినిమా కద ముందుగా
వెంకటేష్ దగ్గరికి వెళ్లినట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే
విక్రమ్ కుమార్ ఈ
సినిమా కథను రాసుకున్న తర్వాత అక్కినేని హీరోలను కాకుండా మరొక ముగ్గురు హీరోలను ప్రధాన పాత్రలో పెట్టి చేయాలి అని అనుకున్నాడట. ఇక వాటిలో మొదటి పాత్ర వెంకటేష్.
నాగార్జున నటించిన పాత్రని
వెంకటేష్ తో చేయించాలి అని దర్శకుడు కథ రాసుకున్నాడట. ఆ తర్వాత
నాగచైతన్య పాత్ర కోసం
లవర్ బాయ్ సిద్ధార్థ ని పెట్టి తీయాలి అని అనుకున్నాడట. అనంతరం ఏఎన్ఆర్ పాత్రలో లెజెండరీ డైరెక్ట్ కే విశ్వనాథ్ పెట్టి చేయాలి అని అనుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ ఊహించని విధంగా అక్కినేని కుటుంబం దగ్గరికి ఈ చివరిగా స్క్రిప్ట్ వెళ్ళింది. అలా అక్కినేని హీరోలు అందరూ కలిసి చేసిన ఈ
సినిమా అందరికీ ఒక
మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!