"ఎన్టీఆర్" కెరీర్ ను నిలబెట్టింది నేనే అంటున్న "జక్కన్న"..!!
రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ బరువు పెరిగి కనిపించారు. దీనితో ఎన్టీఆర్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ తన లుక్స్ పై కేర్ తీసుకోవడం లేదు ఏంటి అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే రాజమౌళితో యమదొంగ చిత్రం ఫిక్స్ అయింది. అయితే తారక్ ఉన్న ఈ లుక్ లో సినిమా చేస్తే వర్కౌట్ కాదు అని రాజమౌళి భావించారు.దీనితో ఉన్నమాట చెబితే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడని తెలిసినా.. జక్కన్న ఎన్టీఆర్ తో చెప్పాలనుకుంది చెప్పేశాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 'తారక్ మీ లుక్స్ ఏమాత్రం బాగాలేవు. రాను రాను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీ సినిమాలు చూడడం మానేస్తున్నారు. లుక్ మార్చాలి. బరువు తగ్గాలి అని చెప్పారట. దీనితో ఎన్టీఆర్.. ఈయన ఏంటి ఇలా అంటున్నాడు.. దాదాపుగా ఇదే బరువు సింహాద్రి చిత్రంలో కూడా ఉన్నాను.ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా.. సరే జక్కన్న ఎంత చెబుతున్నావు బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు అని అడిగారట. అప్పుడు లైపో సక్షన్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు తారక్ విదేశాలకు వెళ్లి లైపో చేయించుకుని బరువు తగ్గారు.
యమదొంగ రిలీజ్ అయ్యాక.. రాజమౌళి తారక్ ని అభినందించారు. తాను కోరుకున్న విధంగా తారక్ బరువు తగ్గి పాత్రకి న్యాయం చేశాడు అని రాజమౌళి అన్నారు. ఆ మూవీలో ఎన్టీఆర్ పాట కూడా పాడారు. యమదొంగ చిత్రం నుంచి ఎన్టీఆర్ తన ఫిట్నెస్ విషయంలో చాలా కేరింగ్ గా ఉన్నారు.