"బద్రి" మూవీకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్ , అమీషా పటేల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. 2000 సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్ దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. జగన్నాథ్ మొదట ఈ మూవీ లో హీరో గా పవన్ కళ్యాణ్ ను కాకుండా మరో హీరో ను అనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో పవన్ కి కథ చెప్పి , ఒప్పించి సినిమా చేశాడు.

అసలు పూరి జగన్నాథ్ ఎవరి కోసం బద్రి సినిమా కథను రెడీ చేశారు. ఎందుకు ఆ సినిమాను ఆ హీరో రిజెక్ట్ చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఓ సినిమా చేయాలి అని భద్ర సినిమా కథను రెడీ చేసుకున్నారు. ఇక ఒక రోజు నాగార్జున కు ఈ కథను పూరి జగన్నాధ్ వినిపించగా , కథ మొత్తం విన్న నాగార్జున సినిమా కథ బాగానే ఉంది , కాకపోతే ఈ రకం ప్రేమ కథ చిత్రంలలో ఇది వరకే నటించాను. మళ్లీ ఇలాంటి కథ అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడట.

దానితో పూరి జగన్నాథ్ చేసేదేమీ లేక ఇదే కథను ఆ సమయంలో ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. ఆయన కూడా కథ మొత్తం విని కొన్ని మార్పులు , చేర్పులు చెప్పినప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం ఇలా అయితేనే బాగుంటుంది అని చివరగా పవన్ కళ్యాణ్ ను కన్విన్ చేసి మొదటగా రెడీ చేసిన కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా నాగార్జునతో చేయాలి అనుకున్న సినిమాను పవన్ కళ్యాణ్ తో చేసి పూరి జగన్నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: