డబ్బులు ఉన్నంత మాత్రాన హీరో అవ్వలేరు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మురళి మోహన్..!

lakhmi saranya
హరీష్ బొల్లంపెల్లి, మాన్య‌ సలాడి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఓసి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై బివీస్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానున నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత మరియు నటుడు, సీనియర్ హీరో అయినటువంటి మురళి మోహన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.
ఈ సినిమా మొదటి టికెట్ను ఎమ్మెల్యే వెంకట్ రమణ రెడ్డి చేతుల మీదగా లాంచ్ చేసి ఫస్ట్ టికెట్ ఆయనే తీసుకున్నారు. ఇక ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మురళి మోహన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. " డబ్బులు ఉన్నంత మాత్రాన హీరో అవ్వలేరు. దానికి ఎంతో శ్రమ మరియు పట్టుదలతో పాటు అదృష్టం కూడా ఉండాలి " అని మురళి శర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయిల్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుందని మురళి శర్మ తెలిపారు.
ఇక ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమధ్య చిన్న, పెద్ద సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ కథ, కంటెంట్ ఉన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అవుతున్నాయి.. అని మురళీ శర్మ పేర్కొన్నారు. ఇక తెలుగు పరిశ్రమ వైపు ఈరోజు ప్రపంచమే చూస్తుంది. మంచి మంచి కథలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు రావాలి అని ఆయన అన్నారు. ప్రజెంట్ మురళీ శర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన కామెంట్స్ చూసిన వారంతా.. కరెక్ట్ గా చెప్పారు సార్. ప్రజెంట్ జనరేషన్ లో డబ్బుంటే హీరో అయిపోతాము అని భావిస్తున్నారు. అటువంటి వారికి బాగా బుద్ధి చెప్పారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: