"ఫిదా" మూవీ ని అంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

MADDIBOINA AJAY KUMAR
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సాయి పల్లవి హీరోయిన్గా ఫిదా అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాయి చంద్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 2017 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే 2017 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించి భారీ కలక్షన్లను వసూలు చేసిన ఈ సినిమాలో మొదటగా మేకర్స్ వరుణ్ తేజ్ ను కాకుండా హీరోగా మరి కొంత మందిని అనుకున్నారట. కానీ వారంతా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ హీరోలు ఎవరు అసలు ..? ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల "ఫిదా" సినిమా కథ మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత దిల్ రాజు కు వినిపించారట. కథ మొత్తం  విన్న దిల్ రాజు కు ఈ సినిమా స్టోరీ సూపర్ గా నచ్చిందట. దానితో వెంటనే ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించారట.

కొన్ని రోజులు డిస్కషన్ అయిన తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఇదే కథను మహేష్ బాబు , రామ్ చరణ్ కు కూడా వినిపించారట. కానీ వారిద్దరు కూడా ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చేయకపోవడంతో దిల్ రాజు సినిమా లేట్ అవుతూ వస్తుంది అనే కారణంతో వరుణ్ తేజ్ ను ఈ సినిమాను ఫైనల్ చేసుకున్నారట. అలా మొదట అల్లు అర్జున్ , మహేష్ , రామ్ చరణ్ ఇలా ముగ్గురు స్టార్ హీరోలను అనుకున్న ఈ సినిమా హీరో పాత్రలోకి వరుణ్ తేజ్ వచ్చాడు. ఇక ఈ మూవీ ద్వారా వరుణ్ తేజ్ కు సూపర్ హిట్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt

సంబంధిత వార్తలు: