అదిరిపోయే లైనప్ సెట్ చేసుకుంటున్నా రామ్ పోతీనేని..!

MADDIBOINA AJAY KUMAR
ఈస్మార్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రామ్ అదిరిపోయే రేంజ్ దర్శకులతో సినిమాలను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇకపోతే రామ్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ నటుడికి ఓ కథను వినిపించగా , ఆ కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే ఈ నటుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ కి దర్శకత్వం వహించి మహేష్ బాబు మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ దర్శకుడు కూడా తాజాగా రామ్ పోతినేని కి ఓ కథను వినిపించినట్లు , ఆ కథ కూడా సూపర్ గా ఉండడంతో ఈ దర్శకుడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇలా డబల్ ఈస్మార్ట్ మూవీ సెట్స్ పై ఉండగానే మరో రెండు మూవీ లను రామ్ పోతినేని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డబల్ ఈస్మార్ట్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ రెండు మూవీ లకు సంబంధించిన షూటింగ్ లను ఈ యువ నటుడు స్టార్ట్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది . ఇకపోతే రామ్ పోతినేని కొన్ని రోజుల క్రితమే స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రామ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందించింది . మరి డబల్ ఈస్మార్ట్ మూవీతో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rp

సంబంధిత వార్తలు: