50 నుండి 150 కి పెరిగిన బాలయ్య క్రేజ్..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. దానితో మేకర్స్ కూడా బాలయ్య హీరోగా సినిమా అంటే ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడడం లేదు. ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా , శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే అఖండ 2 మూవీ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 12 వ తేదీన అఖండ 2 మూవీ ని పూజా కార్యక్రమాలతో బాలకృష్ణ ఎమ్మెల్యే గా గెలిచినటువంటి హిందూపురం లో కానీ లేదా అమరావతి లో కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటికే 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 50 కోట్ల బడ్జెట్ తో అఖండ మూవీ ని తెరకెక్కించగా ఇప్పుడు అఖండ 2 కి 150 కోట్ల బడ్జెట్ ను మేకర్స్ ముందే ప్లాన్ చేసుకున్నారు.

దీనితో 50 కోట్ల నుండి 150 కోట్ల వరకు బాలయ్య క్రేజ్ పెరిగింది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య , బోయపాటి కాంబో లో ఇప్పటి వరకు సింహ , లెజెండ్ , అఖండ మూడు మూవీ లు వచ్చి మూడు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దానితో అఖండ 2 మూవీ మొదలు కాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: