వైవిఎస్ చౌదరి భార్య ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??
వైవీఎస్ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ' సూపర్ హిట్ తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహంచారు.మంచి హిట్స్ అందించిన చౌదరి తర్వాత ఫ్లాపులతో సతమతమయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైవీఎస్ చౌదరి సతీమణి గీత సందడి చేశారు. గీత గతంలో పలు చిత్రాల్లో నటించింది.కింగ్ నాగార్జున నటించి సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడుతా' మూవీలో ఆయన చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత మాస్ మహరాజ నటించిన సింధూరం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించి మెప్పించింది. నిన్నె పెళ్లాడుతా మూవీ సమయంలో వైవీఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవారు.. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.. ఇద్దరి కులాలు వేర కావడంతో పెద్దలు అభ్యంతరం చెప్పినా.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.