నార్త్- సౌత్ నావే అంటున్న 'రానా దగ్గుపాటి'..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా రామానాయుడు మనవడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న రానా.. తనకంటూ ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు.మొన్న మొన్నటిదాకా ఆచీతూచీ అడుగులు వేసిన రానా దగ్గుబాటి ఇప్పుడు గేర్‌ మార్చారు. నేనంటూ రంగంలోకి దిగితే, నార్త్, సౌత్‌ అనే తేడా లేదంటూ వరుసగా ప్రాజెక్టులు సైన్‌ చేస్తున్నారు. మంచి పెర్ఫార్మర్‌ అనే పేరు, ఆయా భాషల మీద ఉన్న పట్టు ఆయనకు అవకాశాలను కుమ్మరిస్తున్నాయి. భల్లాలదేవుడు రానా దగ్గుబాటి ఇప్పుడు యమా బిజీగా కనిపిస్తున్నారు.అలాగే.. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటి తెచ్చుకుని.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మొన్నటి వరకు కెరీర్‌లో ఆచి తూచి అడుగులు వేసిన రానా.. ఇప్పుడు స్పీడ్ పెంచాడు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ సత్తా చాటుకుంటున్నాడు. నిఖిల్ 'స్పై', నవదీప్ 'లవ్ మౌళి' లో సడన్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌ను థ్రిల్ చేసిన ఆయన.. త్వరలోనే పూర్తి స్థాయిలో సినిమాలు ఒప్పుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే నార్త్‌లో 'హౌస్ ఫుల్4' లో నటించిన రానా.. ఇప్పుడు అక్కడ మరో మూవీపై సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో హీరోయిన్‌గా కృతి కర్బంద పేరు వినిపిస్తుంది. ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వని ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు అక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రాలేదు. కాగా.. ఈ అక్టోబర్‌లో 'వేట్టయాన్'తో మొదలయ్యే రానా ప్యాన్‌ ఇండియా జర్నీ.. ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.మరోవైపు షాహిద్‌ కపూర్‌ నటించే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ మూవీలో ఔరంగజేబ్‌గా మిస్టర్‌ దగ్గుబాటి నటిస్తున్నట్టు వార్తలు స్ప్రెడ్‌ అవుతున్నాయి. ఈ అక్టోబర్‌లో వేట్టయాన్‌తో మొదలయ్యే రానా ప్యాన్‌ ఇండియా జర్నీ మరో రేంజ్‌లో స్పీడందుకోబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: