మగవాళ్లకు సపోర్టుగా.. హీరోయిన్ రష్మిక పోస్ట్ వైరల్?
అయితే ఇప్పుడు సౌత్ లో వివిధ భాషల్లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈమె. కాగా ప్రస్తుతం పుష్ప 2 అనే సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అని చెప్పాలి. అయితే ఇటీవల రష్మిక మందన్న మగవారికి సపోర్టుగా చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మగవారు చెడ్డవారు కాదని చాలామంది మంచివారు ఉన్నారు అంటూ రష్మిక మందన వ్యాఖ్యానించింది. ఇంతకీ రష్మిక ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు.
మగవారిని కించ పరుస్తూ ఒక నేటిజన్ చేసిన పోస్ట్ కి హీరోయిన్ రష్మిక మందన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదు గుర్తుంచుకోండి అంటూ యానిమల్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని నేటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ విషయంపై అటు రష్మిక మందన కూడా స్పందించింది. ఈ క్రమంలోనే మగవారికి మద్దతుగా పోస్ట్ పెట్టింది. మూర్ఖులను నమ్మడం నిజంగా భయానకం. కానీ ఈ లోకంలో చాలామంది మంచి మగవాళ్ళు ఉన్నారు. వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం అంటూ రష్మిక మందన్న ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.