జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.
కానీ అక్టోబర్ 10 వ తేదీ కంటే ముందే ఈ సినిమా పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ కోవా లో కంప్లీట్ అయింది. తాజాగా కంప్లీట్ అయిన గోవా షెడ్యూల్ గురించి ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్న రత్నవేలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా రత్నవేలు "దేవర" సినిమా గురించి మాట్లాడుతూ ... తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ను గోవా లో చిత్రీకరించాం.
తాజా షెడ్యూల్ లో భాగంగా గోవా లో అడవి లో బారి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ సన్నివేశాలలో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ కూడా పాల్గొన్నారు. గోవా లో అత్యంత బ్యాడ్ వెదర్ ఉంది. వర్షం కురుస్తున్న కూడా చాలా కష్టపడి షెడ్యూల్ ను పూర్తి చేసాం అని రత్నవేలు చెప్పుకొచ్చాడు. అలాగే రత్నవేలు ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో కెమెరా టీమ్ , లైట్ టీమ్ , స్టంట్ టీమ్ కు ఆయన ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఇకపోతే దేవర మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.