టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోల్ సుందరి అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనే విషయమై ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాను మేకర్స్ దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ ఏడాది దీపావళి బరిలో ఈ మూవీ నిలుస్తుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే మరో ఆప్షన్ను కూడా లైన్లో పెట్టారట. సెకండ్ ఆప్షన్గా క్రిస్మస్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ రెండింటిలో మేకర్స్ దీపావళికే రిలీజ్ చేసేయాలని చూస్తున్నారని సమాచారం.ఎందుకంటే సెప్టెంబర్లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ ఉంది. అలాగే డిసెంబర్లో పెష్పతో పాటు స్మార్ట్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందువల్ల ఈ రెండు సినిమాల గ్యాప్లోనే గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు