వామ్మో.. జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా ఉందా.. హాట్ లుక్స్ వైరల్..!

Anilkumar
తెలంగాణ ఉద్యమం సమయంలో సంచలనాన్ని సృష్టించిన జై బోలో సినిమా ని అంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే  టీవీలకు అతకపోతుంటారు సినీ ఆడియన్స్. అయితే ఇందులో హీరోయిన్గా నటించిన నటి అందరికీ తెలిసే ఉంటుంది.  ఆమె పేరు మీరా నందన్. ఇక ఈ సినిమాలో తన నాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన చక్కని రూపంతో అచ్యుతులకు అమ్మాయిల చాలా సంప్రదాయంగా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.  ఆమె 1990లో కేరళలో పుట్టి పెరిగింది. జర్నలిజం కంప్లీట్ చేసిన ఆమె ఆ తర్వాత ఒక ప్రకటనలో పాల్గొని దాని తర్వాత పలు సింగింగ్ షోలలో కూడా పాల్గొంది.


 అలాగే బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అలా కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా యాంకర్ గా కొనసాగిన ఈమె ఆ తరువాత మలయాళం లో ముల్లా  అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలా పలు సినిమాలు చేసి యాంకర్ గా కొనసాగిన ఈమె 2011లో జై బోలో తెలంగాణ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో తన నటన ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  తెలుగుతోపాటు తమిళ్, కన్నడ ల్లో కూడా నటించింది మీరా నందన్. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్తను శ్రీజును

 వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మీరా నందన్. లకు దూరంగా ఉన్న మీరా నందన్ నిత్యం నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఎన్. శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి టి. సురేంద్రరెడ్డి టోగ్రఫీ అందించారు. ఇందులో విలక్షణ నటుడు జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్, సందీప్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. ఇక దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అందించిన సంగీతం ఆల్ టైమ్ సూపర్ హిట్ అనే చెప్పాలి. 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అల్లకల్లోలమైన రోజులు, పోలీసుల లాఠీ ఛార్జీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం స్టూడెంట్స్ ఆత్మహత్యలు, యదార్థ సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఈ లో చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: