రవితేజ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన గోపీచంద్ మలినేని..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన డాన్ శీను సినిమాతో దర్శకుడుగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడుగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలకే దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. వాటితోనే మంచి విజయాలను అందుకుంటూ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయిలో ఉన్నాడు.

ఈయన కొంత కాలం క్రితం రవితేజ హీరోగా మైత్రి మూవీ సంస్థ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దానితో ఈయన ప్రముఖ హిందీ నటుడు అయినటువంటి సన్నీ డియల్ హీరోగా ఓ మూవీ ని రూపొందించడానికి డిసైడ్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సినిమాను కూడా మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ మూవీ పై అనేక రూమర్స్ రావడం మొదలు అయ్యాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితం రవితేజ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.  

ప్రస్తుతం గోపీచంద్ సన్నీ డియోల్ పై క్రాక్ మూవీ ని రీమిక్ చేస్తున్నాడు అని , అలాగే రవితేజ కోసం ఆయన తయారు చేసుకున్న కథ సెట్ కాకపోవడంతో అదే కథను సన్నీ డియోల్ తో రూపొందించబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. దానితో ఈ వార్తలపై తాజాగా గోపీచంద్ స్పందించాడు... తాజాగా ఆయన మాట్లాడుతూ... నేను సన్నీ డియోల్ తో క్రాక్ మూవీ ని రీమిక్ చేయడం లేదు. అలాగే రవితేజ కోసం రాసుకున్న కథను ఆయనతో చేయడం లేదు. నేను సన్నీ డియోల్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కథతోనే ఆయనతో మూవీ చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gm

సంబంధిత వార్తలు: