టాలీవుడ్ : మహాభారతంను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు దర్శకులు..?
ఇక మహాభారతం మొత్తం తెర మీద ఆవిష్కరిస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కల్కి పార్ట్ 2 ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో సందేహాలు మొదలయ్యాయి. ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .ఇదిలా ఉంటే ఈ ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఇంతకుముందే తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు. జై హనుమాన్ తో బిజీ గా వున్న ప్రశాంత్ వర్మ తప్పకుండా మహాభారతం లోని ఏదైనా ఒక కథని సినిమాగా తీసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.. ఇక బాహుబలితో సంచలనాలు సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీస్తానని ఎప్పుడో చెప్పారు. ప్రెసెంట్ జనరేషన్ కు తగ్గట్టు గా అలాంటి కథను ఎలా చెప్పాలో ఇప్పటికే ప్లాన్ రూపొందించినట్లు గతంలో రాజమౌళి తెలిపారు. మరి రాజమౌళి తీయబోయే మహాభారతం ఎన్నాళ్లకు తెరకెక్కుతుందో చూడాలి..