ఆదిపురుష్` వరకూ వరుస పరాజయాలు చూసిన ప్రభాస్ ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్లు అందుకుని రేసులో మళ్లీ నేనే అనేసాడు. సలార్ తర్వాత కల్కి 2898 తో మరో భారీ విజయం డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో పడిపోయింది. ఇక ఈ సినిమాల తరుత సలార్-2, స్పిరిట్, హనురాఘవపూడి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ముందుగా ఏది పట్టాలెక్కుతుంది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా రాజా సాబ్.. మారుతి డైరెక్షన్లో టైటిల్ రోల్ పోషిస్తున్న రాజాసాబ్ హార్రర్ కామెడీ
జోనర్లో వస్తోంది. ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. ‘‘ మేము కొన్ని ఫేక్ వార్తలను నోటీసు చేశాము. రాజా సాబ్ ఆడిషన్స్ జరుగుతున్నట్లు వచ్చే న్యూస్ అబద్ధం. ప్లీజ్ తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాము’’ అని ఓ ప్రకటనను షేర్ చేశారు. దీనితో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇదిలవుండగా ఇప్పటికే లాంఛ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ చిత్రంలో రిద్ది కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ చిత్రాన్ని 2025 సంక్రాంతి సీజన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీని పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందించారు. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ టాక్కు రాబట్టింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంటోంది. దీంతో ఈ చిత్రం రూ. 700 కోట్లు వసూళ్లను సాధించి రికార్డులు బ్రేక్ చేసింది.